chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍ప్రకాశం జిల్లా

Ongole Local News :తెలుగుదేశం పార్టీకి నూతన ఉత్సాహం–ఉగ్ర నరసింహారెడ్డి నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం-పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు

ఒంగోలు:-తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులుగా డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి గారి ప్రమాణ స్వీకార మహోత్సవం ఒంగోలు పట్టణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు గారు ప్రసంగిస్తూ, పార్టీ భవిష్యత్తుపై విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారు మాట్లాడుతూ,
డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి గారి నాయకత్వంలో ఒంగోలు పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం పార్టీ మరింత బలపడుతుందని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే నాయకుడు ఉగ్ర నరసింహారెడ్డి గారని కొనియాడారు.

పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన నాయకుడికి ఈ బాధ్యతలు అప్పగించడం సరైన నిర్ణయమని, కూటమి ప్రభుత్వ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. పేదలు, రైతులు, యువత సంక్షేమమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని, ఆ దిశగా అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, రాబోయే రోజుల్లో పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా శ్రమించాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలే పార్టీకి పునాది అని, వారి కృషితోనే విజయాలు సాధ్యమని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారు పేర్కొన్నారు.Prakasam local News

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని, నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు. నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker