chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Parchuru Local News :పంటల నమోదు పకడ్బందీగా జరగాలి – ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

పర్చూరు:- నియోజకవర్గంలో పంటల నమోదు (క్రాప్ బుకింగ్) ప్రక్రియను ఎక్కడా లోపాలు లేకుండా పకడ్బందీగా చేపట్టాలని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.Bapatla Local News

ఆదివారం పర్చూరులోని తన క్యాంప్ కార్యాలయంలో మార్టూరు వ్యవసాయ శాఖ అధికారిణి లావణ్య క్రాప్ బుకింగ్ ప్రక్రియపై ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొక్కజొన్న, శనగ పంటలు సాగు చేస్తున్న రైతులు ఒక్కరూ మిగలకుండా తప్పనిసరిగా పంటల నమోదు చేయాలని సూచించారు.bapatla news

రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని, పంటల నమోదు పూర్తిగా జరిగితేనే ప్రభుత్వ పథకాల లాభాలు అందుతాయని తెలిపారు. క్షేత్రస్థాయిలో రైతులను కలిసి అవగాహన కల్పిస్తూ క్రాప్ బుకింగ్ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అన్నదాతల ప్రయోజనాలే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారమే తొలి ప్రాధాన్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

అనంతరం క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సీఎం సహాయనిధి (CMRF), ఎల్‌ఓసీ (LOC) చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. పేదల ఆరోగ్యానికి సీఎం సహాయనిధి వరప్రదానిగా మారిందని, అత్యవసర చికిత్సకు ఆర్థిక భరోసా కల్పిస్తోందని తెలిపారు.

Parchuru Local News :పంటల నమోదు పకడ్బందీగా జరగాలి – ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

ఎమ్మెల్యే సిఫారసు మేరకు ఇంకొల్లు గ్రామానికి చెందిన ఈశ్వరమ్మకు అత్యవసర చికిత్స కోసం ఎల్‌ఓసీ ద్వారా మంజూరైన రూ.1,47,143 చెక్కును అందజేశారు. అలాగే ఇసుకదర్శి గ్రామానికి చెందిన వల్లెపు పార్వతికి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.1 లక్ష చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. లబ్ధిదారులతో ఆప్యాయంగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా ఉత్తర్వుల అందజేత

అదేవిధంగా ఏపీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను పర్చూరు మండల పార్టీ అధ్యక్షులు శంషుద్దీన్‌కు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చేతుల మీదుగా అందజేశారు. మైనారిటీ సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలప్రదంగా అమలవుతాయని ఆయన తెలిపారు.

Parchuru Local News :పంటల నమోదు పకడ్బందీగా జరగాలి – ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తాటి నాగేశ్వరరావు, నల్లపునేని రంగయ్య చౌదరి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker