chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR DISTRICT NEWS: గిరిజన సంక్షేమ హాస్టల్ లో విద్యార్థుల ఆందోళన

ST HOSTEL STUDENTS AGITATION IN GUNTUR

గుంటూరు లోని ఏటి ఆగ్రహరంలో 13వ లైన్ లో గిరిజన వసతి గృహంలో గిరిజన విద్యార్థులు అనేక సమస్యలతో సతమతంతో ఆందోళన చెంది గిరిజన సమాఖ్య నాయకులకు తెలియజేశారు.ఆదివారం గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.శ్రీను నాయక్ సందర్శించడం జరిగింది. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మెనూ ప్రకారం విద్యార్థులకు సక్రమంగా ఆహారం అందించడం లేదని, మంచినీటి వాటర్ ప్లాంట్ మరమ్మత్తులు చేయించలేదని, దీంతో విద్యార్థులు ఉప్పు నీటితో స్నానం చేయడం వలన ఒళ్లంతా దురద, దద్దుర్లు ఏర్పడుతున్నాయన్నారు. విద్యార్థులు నగదు చెల్లించి మంచి నీరు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. గత మూడు నెలలుగా ఈ విధంగా జరుగుతున్న సంబంధిత వార్డెన్ కి విద్యార్థులు తెలియజేసినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. విద్యార్థులు అనారోగ్యాలకు గురైతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ యుద్ధ ప్రాతిపదికన ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారం అందించిన వార్డున్ ను సస్పెండ్ చేయాలని ప్రభుత్వాని కోరారు. వసతి గృహంలో విద్యార్థుల కోసం వారానికి ఒకసారి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. వసతి గృహం బయట విద్యార్థులతో కలిసి వార్డెన్ కు వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు బి. రాంబాబు నాయక్,ఆర్. మహేష్ నాయక్ తోపాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker