ఆంధ్రప్రదేశ్పల్నాడు
ఘనంగా కారంపూడి టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టైలర్స్ డే వేడుకలు
పల్నాడు జిల్లా కారంపూడి. పట్టణంలోని టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టైలర్స్ డే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా కుట్టు మిషన్ వ్యవస్థాపకులు విలియం హైవేకి పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం ర్యాలీతో తాసిల్దార్ కార్యాలయం లో వారికి ఉన్న సమస్యలను వినతి పత్రం ద్వారా తాసిల్దార్ కు అందజేశారు. మానసిక వికలాంగుల పాఠశాలలో పండ్లు బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ వెంకటేష్ నాయక్ టైలర్స్ అసోసియేషన్ పల్నాడు జిల్లా మెంబర్ ఎస్.కె నజీర్ వెంకటేశ్వర్లు గౌరవ అధ్యక్షులు అక్బర్ వలి వైస్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి సెక్రటరీ బి శంకర్ , వెంకటేశ్వర్లు, శ్రీను, సైదా, సీతా నాయక్, ముష్కుల్,తదితరులు పాల్గొన్నారు.