chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

chirala Local News :చీరాలలో దివ్యాంగులకు ఉపకరణాల నమోదు శిబిరం – అలిన్‌కో ఫౌండేషన్ సహకారంతో ఘనంగా నిర్వహణ

Bapatla:చీరాల:- పట్టణంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ అలిన్‌కో ఫౌండేషన్ సహకారంతో దివ్యాంగులకు ఉపకరణాల నమోదు శిబిరాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరానికి పెద్ద సంఖ్యలో దివ్యాంగులు హాజరై తమ వివరాలను నమోదు చేసుకున్నారు.

chirala Local News :చీరాలలో దివ్యాంగులకు ఉపకరణాల నమోదు శిబిరం – అలిన్‌కో ఫౌండేషన్ సహకారంతో ఘనంగా నిర్వహణ

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చీరాల శాసనసభ్యులు శ్రీ ఎంఎం కొండయ్య గారు హాజరై మాట్లాడుతూ, దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగులకు అవసరమైన అన్ని రకాల ఉపకరణాలు అందించేందుకు కట్టుబడి ఉన్నాయని అన్నారు. దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, ఇలాంటి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

బాపట్ల జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడి శ్రీమతి సువార్త మేడం మాట్లాడుతూ, అర్హులైన ప్రతి దివ్యాంగుడికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.Chirala Local News

ఈ సందర్భంగా భావపురి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు, జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు శ్రీ గోగన ఆదిశేషు మాట్లాడుతూ దివ్యాంగుల హక్కుల కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. దివ్యాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పిట్ల శ్రీనివాస్ రెడ్డి, నవ్యాంధ్ర దివ్యాంగుల రాష్ట్ర అధ్యక్షులు శ్రీ షేక్ కలిశా మాట్లాడుతూ దివ్యాంగులకు సమాన అవకాశాలు, సముచిత గౌరవం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ శిబిరంలో వివిధ దివ్యాంగుల సంఘాల నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శిబిరం ద్వారా అర్హులైన దివ్యాంగులకు త్వరలో అవసరమైన ఉపకరణాలు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker