chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur Local News :సరస్ మేళా ప్రాంగణాన్ని ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్-ఏ. తమీమ్ అన్సారియా

గుంటూరు:జనవరి 10:-సరస్ మేళా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సదుపాయాలను జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా శనివారం రాత్రి ఆకస్మికంగా పరిశీలించారు. మేళాలో ఏర్పాటు చేసిన స్టాల్స్, భోజనశాలలు, ఫుడ్ కోర్టు, త్రాగునీటి పంపులను సమగ్రంగా పరిశీలించిన కలెక్టర్, నిర్వాహకులతో నేరుగా మాట్లాడి వారి నుండి ఫీడ్‌బ్యాక్ సేకరించారు.

Guntur Local News :సరస్ మేళా ప్రాంగణాన్ని ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్-ఏ. తమీమ్ అన్సారియా

స్టాల్స్ నిర్వహణ, శుభ్రత, భోజన నాణ్యత, ప్రజలకు అందుతున్న సౌకర్యాలపై కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటివరకు చేపట్టిన ఏర్పాట్లపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…
విధులు కేటాయించిన అధికారులు అందరూ నిరంతర అప్రమత్తతతో విధులు నిర్వహించాలని, మేళాకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా స్టాల్స్ నిర్వహణ, భద్రత, త్రాగునీరు, పారిశుద్ధ్యం అంశాలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.

Guntur Local News :సరస్ మేళా ప్రాంగణాన్ని ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్-ఏ. తమీమ్ అన్సారియా

శనివారం నుంచే మేళాకు అధిక సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారని, రానున్న రోజుల్లో ఈ రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉన్నందున, దానికి అనుగుణంగా అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజల భద్రతకు ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని స్పష్టంచేశారు.

ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల అధికారి కోమలి పద్మ, ఏపీడీ అశోక్ కుమార్, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.GUNTUR NEWS

సరస్ మేళా విజయవంతంగా కొనసాగేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker