chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 పల్నాడు జిల్లా

మందా వెంకట్రావుకు ప్రతిష్టాత్మక అన్నమాచార్య పురస్కారం | Manda Venkatrao Award: A Prestigious Honor

“తాళ్లపాక అన్నమాచార్యుల కల్చరల్ స్టేట్ అవార్డు” అందుకున్న వినుకొండ వాసి మందా వెంకట్రావు.

మందా వెంకట్రావుకు ప్రతిష్టాత్మక అన్నమాచార్య పురస్కారం | Manda Venkatrao Award: A Prestigious Honor

వినుకొండ : Manda Venkatrao Award ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో “శ్రీ అన్నమయ్య కళాకారుల ఐక్యవేదిక” రాజంపేట వారి ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా కడప జిల్లా రాజంపేట. జి.ఎం.సి కళావేదిక నందు సాంస్కృతిక కార్యక్రమాలు, పౌరాణిక పద్య నాటకాలు, అన్నమాచార్యుల ఆత్మీయ గీతాలు, చిన్నారుల కూచిపూడి, భరత నాట్య ప్రదర్శనలు జనవరి 11 మరియు 12 తేదీలలో రెండు రోజులు పాటు జరుగుతున్న ఈ కార్యక్రమాలలో రాజంపేట స్థానిక శాసనసభ్యులు ఆకే .అమర్నాథ్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మన భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలు, జానపద ,పౌరాణిక పద్య నాటకాలు, సంక్రాంతి ముగ్గులు ,హరిదాసుల సందడితో, గంగిరెద్దుల కోలాహలంతో ముందుకు తీసుకురావటం కళాకారుల వల్లే అవుతుందని అన్నారు, ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉందని, నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కీర్తనలను (అలనాడు ఆలపించిన)” తాళ్లపాక అన్నమాచార్యుల కల్చరల్ స్టేట్ అవార్డు” ను మహాకవి, నవయుగ కవి చక్రవర్తి, గుర్రం జాషువా రచనలను పాడి గెలుపొందిన పల్నాడు జిల్లా, వినుకొండ నియోజకవర్గానికి చెందిన ఉత్తమ సేవా కళారత్న,సేవా సామ్రాట్, జీవనజ్యోతి స్వచ్ఛంద సేవ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్౹౹ మందా వెంకట్రావు (వెంకట జాషువా) కు అందించారు.
అవార్డు స్వీకరించిన వెంకట్రావు మాట్లాడుతూ గుర్రం జాషువా కవితలు సాహిత్యం ఎల్లప్పుడూ ప్రజల నాలుకలలో నిలిచిపోతాయని పేదరికం, కులతత్వం పోవాలని కోరుకున్న ఆ మహానుభావుని కవితలు పాడటం నాకు అవార్డు తీసుకురావడం నా జన్మ ధన్యమైందని జాషువా ని కొనియాడారు. అంతరించిపోతున్న కళలను, కళాకారులను ప్రభుత్వం ఆదుకొని వారికి పెన్షన్లు, ఇంటి స్థలాలు, ఇల్లు, ఉపాధి కల్పించి ఆదుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాస్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ డిప్యూటీ డైరెక్టర్ ధన్యాసి పెంచలయ్య, మార్కెట్ యార్డ్ చైర్మన్ చొప్ప ఎల్లారెడ్డి, నవభారత కళానిలయం రాష్ట్ర అధ్యక్షులు ఏవి సుబ్బరాజు, ప్రముఖ సినీ డైరెక్టర్ పసుపులేటి గోపీనాథ్, అన్నమయ్య కళాకారుల ఐక్యవేదిక రాజ్యంపేట అధ్యక్షులు నిర్వాహకులు జబ్బిరెడ్డి వెంకటరెడ్డి మరియు కమిటీ సభ్యులు, కళాకారులు, ప్రజలు పాల్గొన్నారు.

మందా వెంకట్రావుకు ప్రతిష్టాత్మక అన్నమాచార్య పురస్కారం | Manda Venkatrao Award: A Prestigious Honor

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker