chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్

AP LATEST NEWS: సరస్ మేళా ప్రాంగణంలో నాచురల్ ఫార్మింగ్, బ్యాంబో మరియు అగ్రి మార్కెటింగ్ పై శిక్షణ

SARAS MELA RESPONSE

మినీ భారత్ గా భారతదేశ సాంస్కృతి, సాంప్రదాయాల ప్రతీకగా దేశవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాలు సభ్యులు తయారుచేసిన ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాలకు నిర్వహిస్తున్న సరస్ మేళా అఖిలభారత డ్వాక్రా బజార్ ను శుక్రవారం కనుమ పర్వదినం రోజు అత్యధిక సంఖ్యలో ప్రజలు సందర్శించారు. ఉదయం నుంచే ప్రజల రద్దీ కొనసాగింది సాయంత్రం సమయంలో ఇది మరింత ఎక్కువైంది. ప్రజలు అత్యధిక సంఖ్యలో వస్తుండటంతో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా నిరంతర పర్యవేక్షణలో డీఆర్డీఎ పీడీ విజయలక్ష్మి, డి ఆర్డిఏ అధికారులు, ఇతర శాఖల అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రాంగణంలో స్టాల్స్ వద్ద, ఎంమ్యూజ్మెంట్ పార్కులో, ఫుడ్ కోర్ట్, వేదిక వద్ద ఉన్న ఎలక్ట్రిక్ పాయింట్ల, ఇతర ఏర్పాట్లు ను. డీఆర్డీఏ, విద్యుత్, అగ్నిమాపక శాఖ , ఆర్ అండ్ బి, పోలీసు, మున్సిపల్ తదితర శాఖల అధికారులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం తనిఖీలు నిర్వహించి, అవసరమైన ప్రాంతాల్లో వెంటనే మరమ్మత్తులు చేపడుతున్నారు. నాచురల్ ఫార్మింగ్, బ్యాంబో మరియు అగ్రి మార్కెటింగ్ పై శిక్షణ. సరస్ మేళా లోని శిక్షణా కేంద్రంలో శుక్రవారం స్వయం సహాయక సంఘ సభ్యులకు నాచురల్ ఫార్మింగ్, బ్యాంబో మరియు అగ్రి మార్కెటింగ్ పై మాస్టర్ ట్రైనర్ వై ప్రసంగి శిక్షణ అందించారు. సైబర్ మోసాలు, డిజిటల్ అవేర్నెస్, సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న మోసాలు, యాప్ ల లింకులతో జరుగుతున్న ఫైబర్ నేరాలపై మ్యాజిక్ బస్సు ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి కిరణ్ అవగాహన కల్పించారు. అదేవిధంగా పరిశ్రమల శాఖ ఐపిఓ సర్వీస్, తయారీ రంగ వ్యాపారాలకు రాయితీతో ప్రభుత్వం అందించే రుణాల గురించి వివరించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker