chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Battiprolu Local News :ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం – ఎమ్మెల్యే నక్క ఆనందబాబు

భట్టిప్రోలు :-తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నటసార్వభౌములు, పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా. నందమూరి తారక రామారావు గారి వర్ధంతిని పురస్కరించుకుని బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు.

Battiprolu Local News :ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం – ఎమ్మెల్యే నక్క ఆనందబాబు

ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వెల్టూరు నుంచి భట్టిప్రోలు చెక్‌పోస్ట్ వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు.Bapatla Local News ర్యాలీ అంతటా ఎన్టీఆర్ నినాదాలతో వాతావరణం మార్మోగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నక్క ఆనందబాబు మాట్లాడుతూ,
“పేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహానేత ఎన్టీఆర్. రెండు రూపాయలకే బియ్యం అందించి పేదవాడి ఆకలి తీర్చిన గొప్ప నాయకుడు ఆయనే. పింఛన్ వ్యవస్థను కేవలం 30 రూపాయలతో ప్రారంభించి, దానిని క్రమంగా పెంచుతూ నేడు 4000 రూపాయల వరకు తీసుకువచ్చే స్థాయికి ఎన్టీఆర్ బాటలోనే తెలుగుదేశం పార్టీ పాలన సాగుతోంది” అని అన్నారు.

Battiprolu Local News :ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం – ఎమ్మెల్యే నక్క ఆనందబాబు

ఎన్టీఆర్ చెప్పిన మాటలు, చేసిన పనులు ఎప్పటికీ మార్గదర్శకాలని, ఆయన ఆశయాలు అంగీకారయోగ్యమైనవని, ప్రజాహితమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ కలల సువర్ణాంధ్ర సాధనే తమ లక్ష్యమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎన్టీఆర్‌కు ఘన నివాళులు అర్పించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker