chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur Local News :ఒక కుటుంబం–ఒక వ్యాపారవేత్త లక్ష్యాలు సాధించాలి బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలి-జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా

గుంటూరు, జనవరి 23:- జిల్లాలో మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు ఒక కుటుంబం–ఒక వ్యాపారవేత్త కార్యక్రమానికి నిర్దేశించిన లక్ష్యాల మేరకు బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు.

శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతులు ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అజెండా అంశాలపై మాట్లాడుతూ, బ్యాంకులు మంజూరు చేసిన రుణాలు మార్చి 8వ తేదీ నాటికి నూరుశాతం గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Guntur Local News :ఒక కుటుంబం–ఒక వ్యాపారవేత్త లక్ష్యాలు సాధించాలి బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలి-జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా

పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ విండో ద్వారా అందిన దరఖాస్తులను సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని ఎస్‌ఎల్‌ఏలోపే అనుమతులు మంజూరు చేసేలా పరిశ్రమల శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు శిక్షణ, పరిశ్రమలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా వన్ స్టాప్ సెంటర్ ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.

ఆర్‌ఎంపీ శిక్షణ కార్యక్రమాలను డీఆర్‌డీఏ, మెప్మా, మండల స్థాయి అధికారులు, పరిశ్రమల సంఘాలతో సమన్వయం చేసుకుని మార్గదర్శకాలకు అనుగుణంగా సక్రమంగా నిర్వహించాలని సూచించారు. జిల్లాలో ఎస్‌ఐపిబి, క్యాబినెట్ ఆమోదం పొందిన పరిశ్రమలు, రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్న పరిశ్రమలు వేగంగా స్థాపించబడేలా సంబంధిత శాఖలు పర్యవేక్షించాలని తెలిపారుGuntur Local News.

వ్యాపారవేత్తలకు స్మార్ట్ మీటర్లపై అవగాహన కల్పించేలా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే పరిశ్రమల రాయితీలకు సంబంధించిన 18 క్లైయిమ్స్‌కు రూ.1,63,91,972లను మంజూరు చేస్తూ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆమోదం తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కే. ఖాజావలి, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఏ. జయలక్ష్మి, ఏపిపిసిబి ఈఈ ఎండి నజీనా బేగం, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ ఎం.ఎల్.ఎన్. రావు, డిపిఓ సాయికుమార్, జిల్లా ఉపాధి అధికారి దుర్గాబాయి, లీడ్ బ్యాంక్ మేనేజర్ మహిపాల్ రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ విజయలక్ష్మి, సోషల్ వెల్ఫేర్ డీడీ చెన్నయ్య, డీసీఎల్ఏ గాయత్రి దేవి, భూగర్భ జలవనరుల శాఖ డీడీ వందనం, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సంజీవరావు, జిల్లా టూరిజం అధికారి రమ్య, సీపీడిసిఎల్ గుంటూరు సర్కిల్ ఈఈ నాగేశ్వరరావు, కేవీఐబి ఏడి ఏ ఆనంద్ కుమార్, జిల్లా రిజిస్ట్రార్ శైలజ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు, సిక్కి ఆర్‌ఎం పరిమళ, డీఐసీసీఐ జిల్లా కోఆర్డినేటర్ కె. పావని తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker