chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విశాఖపట్నం జిల్లా

Visakhapatanam Local News :రోజ్‌గార్‌ మేళా ఘన విజయం

విశాఖపట్నం, జనవరి 24:-ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను వేగంగా భర్తీ చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన రోజ్‌గార్‌ మేళా దేశవ్యాప్తంగా ఘన విజయాన్ని సాధించిందని ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఈ మేళా ద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించి, వారిలో కొత్త ఆత్మవిశ్వాసం, ఉత్సాహం పెరిగిందన్నారు.

Visakhapatanam Local News :రోజ్‌గార్‌ మేళా ఘన విజయం

శనివారం ఉదయం సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విశాఖ సాగర్‌మాల కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని, కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గతంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో తీవ్ర జాప్యం ఉండేదని, సంవత్సరాల తరబడి నోటిఫికేషన్లు వెలువడని పరిస్థితులు ఉన్నాయని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మిషన్ మోడ్‌లో చేపట్టి వేగవంతం చేసిందన్నారు.

Visakhapatanam Local News :రోజ్‌గార్‌ మేళా ఘన విజయం

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 17 రోజ్‌గార్‌ మేళాలను విజయవంతంగా నిర్వహించి సుమారు 11 లక్షల మందికి నియామక పత్రాలు అందజేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కిందని మంత్రి వెల్లడించారు. తాజాగా నిర్వహించిన 18వ రోజ్‌గార్‌ మేళాలో దేశవ్యాప్తంగా 61 వేల మందికి నియామక పత్రాలు అందజేయగా, విశాఖపట్నంలో 392 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసినట్లు తెలిపారుAPSRTC CONTACT NUMBERS AND MAIL IDS OF DEPOT MANAGERS.

మేక్ ఇన్ ఇండియా, మెడ్ ఇన్ ఇండియా కార్యక్రమాలతో పాటు ఎంఎస్‌ఎంఈ రంగానికి ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతోందని మంత్రి పేర్కొన్నారు.

Visakhapatanam Local News :రోజ్‌గార్‌ మేళా ఘన విజయం

ఈ కార్యక్రమంలో సీఐఎస్ఎఫ్ ఐజీ శర్వానన్, డీఐజీ డా. రాఘవేంద్రకుమార్, పోర్టు సెక్రటరీ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker