chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍తిరుపతి జిల్లా

Tirupati Local News :ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, జనవరి 25:-16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం తిరుపతిలో ఓటు హక్కుపై అవగాహన కల్పించే ర్యాలీని నిర్వహించారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం గ్రౌండ్ నుంచి ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం వరకు జరిగిన ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్, నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమతో కలిసి పాల్గొన్నారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.

Tirupati Local News :ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్

ఈ సందర్భంగా ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ మాట్లాడుతూ, ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని పేర్కొన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకుని తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సాంకేతికతను ఉపయోగించి ఎన్నికల ప్రక్రియ మరింత సులభంగా, నమ్మకంగా మారిందన్నారు.

Tirupati Local News :ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్

యువత తమ ఓటుతో పాలకులను ఎన్నుకునే శక్తి తమ చేతుల్లోనే ఉందని, పట్టణ ప్రాంతాల్లో కూడా ఓటు హక్కు వినియోగ శాతం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. 2011 సంవత్సరం నుంచి ప్రతి ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది “మై ఇండియా – మై ఓటు” అనే థీమ్‌తో ముందుకు వెళ్లాలని సూచించారు.

నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య మాట్లాడుతూ, యువత ఓటరుగా నమోదు కావడం, ఓటు హక్కును వినియోగించుకోవడం ఎంతో ముఖ్యమని తెలిపారు. ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన సంస్కరణలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Tirupati Local News :ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్

ఈ కార్యక్రమంలో ఎన్నికల నిర్వహణలో ప్రతిభ కనబరిచిన AERO, BLO, ఆపరేటర్లకు జిల్లా కలెక్టర్ ప్రశంసాపత్రాలు అందజేశారు. జాతీయ ఓటర్ల దినోత్సవం అంశంపై నిర్వహించిన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అలాగే గత ఎన్నికల్లో నిరంతరంగా ఓటు హక్కు వినియోగించిన సీనియర్ సిటిజన్లను ఘనంగా సన్మానించారు.DEVOTIONAL

ఈ కార్యక్రమంలో ఎలక్షన్స్ సూపర్డెంట్ రమేష్ బాబు, తహసీల్దార్ సురేష్ బాబు, పవన్, సిబ్బంది, విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker