
బాపట్ల :77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ గారి బంగ్లాలో ‘ఎట్ హోమ్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవం ప్రజాస్వామ్య విలువలను మరింత బలోపేతం చేసే మహత్తర పర్వదినమని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, జిల్లా సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.Bapatla Local News

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భావన, జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.










