
బాపట్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు ఆదేశాల మేరకు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైసీపీ నేత అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై చేసిన వ్యాఖ్యలను టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు.

సమావేశంలో మాట్లాడిన నాయకులు, చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్న నాయకుడని, అలాంటి వ్యక్తిపై అవాస్తవ వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. వైసీపీ నేతల వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు. రాజకీయ దాడులను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో సరైన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.TODAY BAPATLA NEWS
ఈ సమావేశంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు, మందపాటి ఆంద్రెయ, అల్లం గోపి, శీలం శ్రీనివాసరావు, ఫరీద్ మస్తాన్, కొల్లురు వెంకట్రావు, విన్నకోట వీరయ్య నాయుడు, దారా అశోక్, సూరగని శేఖర్, బీమా కోటేశ్వరరావు, ప్రసాద్, రాఘవేంద్ర తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










