chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur Local News : 5న సాగునీటి సంఘాల అధ్యక్షుల సదస్సు-12 వేల మంది అధ్యక్షులతో అమరావతిలో భారీ సమ్మేళనం

గుంటూరు, ఫిబ్రవరి 4:-రాష్ట్రంలోని సాగునీటి సంఘాల బలోపేతమే లక్ష్యంగా ఈ నెల 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సాగునీటి సంఘాల అధ్యక్షులతో భారీ సదస్సు నిర్వహించనున్నారు. “మన నీరు – మన భవిష్యత్తు… సాగునీటి సంఘాల పాత్ర” అనే శీర్షికతో ఈ సదస్సును ఏర్పాటు చేశారు.

Guntur Local News : 5న సాగునీటి సంఘాల అధ్యక్షుల సదస్సు-12 వేల మంది అధ్యక్షులతో అమరావతిలో భారీ సమ్మేళనం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సదస్సు అమరావతిలోని నేలపాడు ప్రాంతంలో, హైకోర్టు సమీపంలోని పెరేడ్ గ్రౌండ్స్‌లో బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి జరగనుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సుమారు 12 వేల మంది సాగునీటి సంఘాల అధ్యక్షులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

Guntur Local News : 5న సాగునీటి సంఘాల అధ్యక్షుల సదస్సు-12 వేల మంది అధ్యక్షులతో అమరావతిలో భారీ సమ్మేళనం

ఈ సదస్సు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జలవనరుల శాఖ చీఫ్ ఇంజినీర్ బి. రాంబాబులతో కలిసి జలవనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామా నాయుడు బుధవారం పరిశీలించారు. భోజన వసతి, తాగునీరు, పారిశుధ్యం, భద్రత తదితర అన్ని ఏర్పాట్లు ఎలాంటి లోటుపాట్లు లేకుండా పక్కాగా ఉండాలని అధికారులను మంత్రి ఆదేశించారు.Guntur Local news

ఉదయం 10 గంటల నుంచే సాగునీటి సంఘాల అధ్యక్షుల రాక ప్రారంభమవుతుందని, జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపడతామని మంత్రి డా. నిమ్మల రామా నాయుడు తెలిపారు.

Guntur Local News : 5న సాగునీటి సంఘాల అధ్యక్షుల సదస్సు-12 వేల మంది అధ్యక్షులతో అమరావతిలో భారీ సమ్మేళనం

ఈ పరిశీలన కార్యక్రమంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఆర్డీవో కె. శ్రీనివాసరావు, ఏఎస్పీ ఏ.టి.వి. రవికుమార్, డీఎస్పీ టి. మురళీకృష్ణ, జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ వెంకట రత్నం, జిల్లా పౌర సరఫరాల అధికారి పి. కోమలి పద్మ, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం. పద్మావతి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి యు. చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker