
విశాఖపట్నం, ఫిబ్రవరి 6:– వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్తో భాగస్వామ్యం కావడానికి ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోందని, ఇలాంటి సమయంలో దేశం మరింత సురక్షితంగా ఉందన్న సందేశాన్ని ప్రజలంతా కలసి ఇవ్వాల్సిన అవసరం ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.

శుక్రవారం విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వందేమాతరం తీర సైక్లోథాన్–2026’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐఎస్ఎఫ్ సేవలను కొనియాడుతూ ప్రసంగించారు.
ఈ కార్యక్రమం సాధారణ సైక్లోథాన్ మాత్రమే కాదని, దేశాన్ని సురక్షిత దిశగా నడిపించే ఒక ఉద్యమమని మంత్రి పేర్కొన్నారు. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో వందేమాతరం గీతం భిన్న భాషలు, సంస్కృతులను ఒకే త్రివర్ణ పతాకం కింద ఏకం చేసిందని గుర్తుచేశారు. 2014 తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం తన సాంస్కృతిక ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచానికి చాటుతోందన్నారు.

CISF–Cycle–Coast అనే మూడు ‘సి’లతో దేశం అభివృద్ధి బాటలో సాగుతోందని, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో మరో ‘సి’గా కూటమి ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యాలను వేగంగా సాధిస్తోందని తెలిపారు.
పౌర విమానయాన శాఖ మంత్రిగా సీఐఎస్ఎఫ్ దేశవ్యాప్తంగా 71 విమానాశ్రయాలు, 250కుపైగా పోర్టుల భద్రతను సమర్థంగా నిర్వహిస్తోందని ప్రశంసించారు. 2014లో 5–6 వేల కోట్లుగా ఉన్న సీఐఎస్ఎఫ్ బడ్జెట్ 2026 నాటికి రూ.15,973 కోట్లకు పెరగడం సిబ్బంది సేవలకు ఇచ్చిన గౌరవమన్నారు.

సైక్లోథాన్లో పాల్గొన్న వారిలో సగానికి పైగా మహిళలు ఉండటం ఎన్డీఏ ప్రభుత్వ మహిళా సాధికారతకు నిదర్శనమని చెప్పారు. ఖాకీ మాత్రమే కాకుండా ప్రజలందరూ బాధ్యతగా వ్యవహరించినప్పుడే దేశ భద్రత మరింత బలోపేతమవుతుందని మంత్రి స్పష్టం చేశారు. తీరప్రాంత భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ ఉత్తరాంధ్రను రాష్ట్రానికే కాక దేశానికే కీలక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రస్తుతం విశాఖపట్నం గురించి ప్రపంచం మాట్లాడుతోందని తెలిపారు.
సైక్లోథాన్ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను మంత్రి ఆసక్తిగా తిలకించారు. సుదీర్ఘ సైకిల్ యాత్ర చేసిన సైక్లిస్టులను ప్రశంసించి మెడల్స్ అందజేశారు.Visakha lo IT:విశాఖలో ఐటీ హడావిడి… భూమిపూజలకు సిద్దమైన లోకేష్
ఈ కార్యక్రమంలో విశాఖపట్నం పోర్ట్ అథారిటీ డిప్యూటీ చైర్పర్సన్ రోషిణి అపరంజి, సీఐఎస్ఎఫ్ అడిషనల్ డీజీ బినీత ఠాకూర్, ఇన్స్పెక్టర్ జనరల్ ఎస్.ఆర్. శరవణన్, డీఐజీలు రాఘవేంద్ర కుమార్, ప్రకాష్ రెడ్డి, సీఐఎస్ఎఫ్ సిబ్బంది, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










