
చీరాల:- చీరాల ఒకటో పట్టణ ట్రాఫిక్ ఇంచార్జి ఎస్సై పవన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కఠినంగా నిర్వహించారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన పలువురు పట్టుబడ్డారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వారిని పోలీసులు చీరాల ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కేసులను పరిశీలించిన మెజిస్ట్రేట్, నిబంధనలు ఉల్లంఘించిన ఎనిమిది మందికి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున జరిమానా విధించారు.
ఈ సందర్భంగా ఎస్సై పవన్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ప్రజల ప్రాణాల భద్రత దృష్ట్యా ఇటువంటి తనిఖీలు కఠినంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్కు పాల్పడే వారిపై ఇకపై కూడా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.Bapatla pattanam lo MLA
ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, తమతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడుకోవాలని పోలీసులు ప్రజలకు సూచించారు.










