
కృష్ణాజిల్లా, గుడివాడ:-గుడివాడలోని కే.బి.ఆర్. ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 9వ తేదీన ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మెగామేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఓ. మంజులాదేవి తెలిపారు.
ఈ సందర్భంగా అర్హులైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో సోమవారం ఉదయం 10 గంటలకు కళాశాలకు హాజరుకావాలని ఆమె సూచించారు. ఈ మెగామేళాలో వివిధ ప్రముఖ కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొని అభ్యర్థుల ఎంపిక చేపట్టనున్నట్లు తెలిపారు.
ఐటీఐ పూర్తి చేసినవారితో పాటు, పూర్తి చేయని అన్ని విభాగాల యువతకు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని ప్రిన్సిపల్ స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.Gudivada lo Cyclothon :గుడివాడలో సైక్లోథాన్ 2025 సైకిల్ ర్యాలీలోపాల్గొన్నMLA వెనిగండ్ల రాము దంపతులు










