
బాపట్ల, ఫిబ్రవరి 08:– జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నేడు (సోమవారం) నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐఏఎస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులతో కలిసి GDP వృద్ధి రేటు, RTGS, PPP ప్రాజెక్టుల పురోగతి, స్వర్ణాంధ్ర విజన్–2047, లా అండ్ ఆర్డర్ అంశాలపై వర్చువల్ సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొనాల్సి ఉండటంతో, జిల్లా కేంద్రంలో నిర్వహించే పీజీఆర్ఎస్ను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి ఎవరూ కూడా జిల్లా కలెక్టరేట్కు అర్జీలతో రావద్దని కలెక్టర్ సూచించారు.Bapatla Local News
అయితే, మండల తహశీల్దార్ కార్యాలయాల్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని, సంబంధిత మండల పరిధిలోని ప్రజలు తమ సమస్యల అర్జీలను మండల తహశీల్దార్ కార్యాలయాల్లో సమర్పించవచ్చని కలెక్టర్ తెలిపారు.










