
డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన “డ్రగ్స్పై దండయాత్ర” కార్యక్రమం ప్రజల్లో విశేష స్పందనను రాబడుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా 14వ రోజు నిర్వహించిన సైకిల్ యాత్ర జి.కొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఘనంగా ముగిసింది.

ఈ రోజు నిర్వహించిన సైకిల్ యాత్ర 23 కిలోమీటర్ల మేర కొనసాగగా, ఇప్పటివరకు మొత్తం 187 కిలోమీటర్ల దూరం పూర్తి చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఉదయం ఇబ్రహీంపట్నం జెన్కో ఇన్స్టిట్యూట్ నుంచి ప్రారంభమైన ఈ సైకిల్ యాత్ర
కొండపల్లి A కాలనీ, కొండపల్లి టీచర్స్ కాలనీ, కొండపల్లి ఇండస్ట్రియల్ ఏరియా, కట్టుబడి పాలెం మీదుగా సాగి
చివరగా జి.కొండూరు – వివేకానంద స్కూల్ వద్ద ముగిసింది.

ఈ కార్యక్రమంలో డి.సి.పి. శ్రీమతి కె.జి.వి. సరిత ఐపీఎస్ గారు,
రూరల్ డి.సి.పి. శ్రీ బి. లక్ష్మీ నారాయణ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని,
డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలను ప్రజలకు వివరించి అవగాహన కల్పించారు.
ప్రత్యేకంగా యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని సూచించారు.
ఈ సైకిల్ యాత్రను
మైలవరం ఏ.సి.పి. శ్రీ ప్రసాదరావు,
జి.కొండూరు ఎస్.ఐ. శ్రీ సతీష్ గారు
వారి సిబ్బంది సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించారు.
మొత్తం కార్యక్రమం డి.సి.పి. శ్రీ బి. లక్ష్మీ నారాయణ గారి పర్యవేక్షణలో కొనసాగింది.

ప్రజల నుంచి లభించిన విశేష స్పందనతో, రెట్టింపు ఉత్సాహంతో ఈ ర్యాలీ విజయవంతంగా కొనసాగిందని అధికారులు తెలిపారు.VIJAYAWADA :విజయవాడలో జరగనున్న IJU 11వ ప్లీనరీ – బ్రోచర్ ఆవిష్కరణ
ప్రజల్లో పెరుగుతున్న మద్దతే ఈ కార్యక్రమ విజయానికి నిదర్శనంగా నిలిచిందన్నారు.
“ఇది కేవలం ఒక యాత్ర కాదు…
యువత భవిష్యత్తును కాపాడే సంకల్పం”
అని ఈ సందర్భంగా పోలీస్ అధికారులు స్పష్టం చేశారు.
డ్రగ్స్కు సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే
112 లేదా 1972 నంబర్లకు తెలియజేయాలని,
అలాగే ప్రతి ఒక్కరూ https://events.ntrpolice.in/ వెబ్సైట్ను సందర్శించాలని పోలీసులు కోరారు.










