
వినుకొండ (పల్నాడు జిల్లా):-వినుకొండ పట్టణ బులియన్ మర్చెంట్ అశోసియేషన్ అధ్యక్షుడు, బంగారుపు దుకాణాల అశోసియేషన్ అధ్యక్షుడు, ఆర్యవైశ్య సంఘం ప్రముఖ నేత పొత్తూరి జనార్దన్ రావు (జనాయ్) గుండెపోటుతో మృతి చెందారు. ఆయన ఆకస్మిక మృతి వినుకొండ పట్టణంతో పాటు వ్యాపార వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
ప్రముఖ ఆర్యవైశ్యుడిగా, వ్యాపార రంగంలో సేవాభావంతో గుర్తింపు పొందిన జనార్దన్ రావు అనేక సంవత్సరాలుగా బులియన్, స్వర్ణ వ్యాపారుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఆయన మరణ వార్త తెలియగానే బంగారుపు దుకాణాల అశోసియేషన్ సభ్యులు, పలువురు వ్యాపారులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆయన నివాసానికి చేరుకొని మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారుపల్నాడు అర్ధరాత్రి తనిఖీలు కలెక్టర్-ఎస్పీ అప్రమత్తత||Midnight Inspections by Collector and SP in Palnadu.
ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జనార్దన్ రావు సేవలను స్మరిస్తూ పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన లేని లోటు వ్యాపార రంగానికి తీరనిదని పలువురు పేర్కొన్నారు.










