
జగ్గంపేట: ఫిబ్రవరి:-కాకినాడ జిల్లా జగ్గంపేటలో నిరుపేదలకు అన్నదానం అందించే కార్యక్రమం మరోసారి స్ఫూర్తిదాయకంగా కొనసాగింది. జగ్గంపేట టౌన్ పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో “డొక్కా సీతమ్మ క్యాంటీన్” నిర్వహించారు.

ప్రతి మంగళవారం తన సొంత ఖర్చులతో ఈ క్యాంటీన్ను నిర్వహిస్తున్న తుమ్మలపల్లి రమేష్, ఈరోజు సుమారు 500 మంది పేదలకు అన్నదానం చేశారు. కార్యక్రమానికి హాజరైన జనసేన నాయకులు, కార్యకర్తలు స్వయంగా భోజనం వడ్డించి సేవాభావాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ఆదర్శంగా తీసుకుని డొక్కా సీతమ్మ క్యాంటీన్ పేరుతో నిరుపేదలకు ఉచిత భోజనం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి తోడ్పడటం తమ లక్ష్యమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాదారపు వీరబాబు, గంధం శ్రీనివాస్, గండికోట శీను, తుమ్మల మనోజ్, అడబాల వీరబాబు, రావు చక్రధర్, డ్రీమ్ మాస్టర్, గోకవరం ఆటో స్టాండ్ జనసైనికులు బోయిన వీరబాబు, గల్లా అనిల్, గంట రాజు తదితరులు పాల్గొన్నారు.కాకినాడలో పురుగుమందు స్ప్రేయర్ మొరాయింపు – రైతుల్లో ఆందోళన||Sprayer Malfunction in Kakinada Creates Panic Among Farmers
జగ్గంపేటలో ప్రతి వారం కొనసాగుతున్న ఈ అన్నదాన కార్యక్రమం స్థానిక ప్రజల ప్రశంసలు అందుకుంటోంది.










