
కాకినాడ: కిర్లంపూడి:-జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన మండపాక చిలకమ్మ ఇటీవల అనారోగ్యానికి గురైన విషయం తెలుసుకున్న జనసేన పార్టీ జగ్గంపేట ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆమె నివాసానికి వెళ్లి పరామర్శించారు.

చిలకమ్మ ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని, అవసరమైన వైద్య సహాయం అందించాలని సూచించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ధైర్యం చెప్పారు. పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.Kakinada Petrol Water Mix Incident Sparks Outrage in Andhra Pradesh||కాకినాడ పెట్రోల్లో నీళ్లు కలిసిన ఘటన
ఈ కార్యక్రమంలో మాదారపు వీరబాబు, గుంటముక్కల చిన్న, కాయల మణికంఠ, గోకేడ ప్రసాద్, వంశీ తదితరులు పాల్గొన్నారు.










