
కాకినాడ: కిర్లంపూడి:-జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం తామరాడ గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త పప్పల సతీష్ కుమార్ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిన వెంటనే జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ మంగళవారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.

ఈ సందర్భంగా సతీష్ కుమార్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పార్టీ తరఫున అవసరమైన సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. జనసైనికులు కష్టకాలంలో ఒంటరిగా ఉండరని, పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తుమ్మలపల్లి రమేష్ పేర్కొన్నారు.APSRTC CONTACT NUMBERS AND MAIL IDS OF DEPOT MANAGERS
ఈ కార్యక్రమంలో తామరాడ ఎంపీటీసీ గోకేడ రాజా, తామరాడ జనసేన పార్టీ అధ్యక్షులు సుంకర రాజు, కాయల మణికంఠ, గోకేడ ప్రసాద్, మాదారపు వీరబాబు, బర్రె వికాస్, వంశీ తదితరులు పాల్గొన్నారు.










