chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్

AP LATEST NEWS: సాంకేతిక పరిజ్ఞానంతో వేగంగా శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తాం

CENTRAL MINISTER PEMMASANI FELICITATION CEREMONY

గుంటూరు రైల్వే ట్రాక్ పై శంకరవిలాస్ బ్రిడ్జి ప్రధాన వంతెన తొలగింపు పనులు విజయవంతం కావడం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్టర్ మరియు కార్మికులను గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక డిఆర్ఎం కార్యాలయంలో శనివారం సన్మానించారు.ఈ సందర్భంగా పెమ్మసాని మీడియాతో మాట్లాడారు. మనం ఎన్ని కష్టపడి పని చేసినా, కొన్ని పనులు మాత్రం జీవితంలో సంతృప్తిని కలిగిస్తాయి. అలాంటి పనుల్లో ఈ శంకర్ విలాస్ డెమోలిష్ పనులు ఒకటి. ఈ నిర్మాణాల తొలగింపులలో ఏ చిన్న తప్పు జరిగిన ఎన్నో ఇబ్బందులు కలిగేవి. కానీ ఎక్కడా, ఎలాంటి సమస్య ఎదురు కాకుండా, చాలా జాగ్రత్తగా ఈ పనులు పూర్తి చేయగలిగినందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వ వ్యవస్థలను సరైన పద్ధతిలో సమన్వయపరచుకుంటే ఎంత అద్భుతంగా పనిచేయవచ్చు అనేందుకు ఇది ఒక చక్కటి కేస్ స్టడీగా ఉండబోతుంది. 30 రోజుల్లో ఈ పనులు పూర్తి చేయాలి అన్న లక్ష్యంతో మొదలుపెట్టగా, రికార్డు స్థాయిలో కేవలం 21 – 22 రోజుల్లో పూర్తి చేయడం నిజంగా గుర్తుండిపోయే అంశం. ఇలాంటి అపురూప జ్ఞాపకాలను అందించిన అనురు గ్రూప్స్, ACTS డిజైన్స్ & సొల్యూషన్స్ వారికి, సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న అధికారులను, సిబ్బందిని, కార్మికులను సన్మానించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు.ఈ కార్యక్రమంలో డిఆర్ఎం సుదేశ్నా సేన్, అడిషనల్ డిఆర్ఎం రమేష్, సీనియర్ డివిజనల్ ఇంజనీర్ కోఆర్డినేషన్ శ్రీనివాస్, ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విశ్వనాథ్, స్టేషన్ మాస్టర్ నాగేశ్వరరావు , లక్ష్మీ ఇన్ఫ్రా కాంట్రాక్టర్, సిబ్బంది, డెమోలిసింగ్ ఏజెన్సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker