
బాపట్ల జిల్లా, చీరాల:- చీరాల నియోజకవర్గం జాండ్రపేటలోని బీవీ అండ్ బీఎన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చాట్రాసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం సీలింగ్ ఫ్యాన్లను అందజేశారు. పాఠశాలలో కొన్ని తరగతి గదుల్లో అవసరాన్ని గుర్తించి ఈ సహాయాన్ని అందించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న చాట్రాసి ఫౌండేషన్ చైర్మన్, చీరాల టీడీపీ నాయకుడు చాట్రాసి రాజేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తన వంతు సహాయం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రధానోపాధ్యాయుల అభ్యర్థన మేరకు పాఠశాల భోజనశాల భవనానికి పెయింటింగ్ అవసరమని తెలియగానే తక్షణమే స్పందించి, దానికి కావాల్సిన సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో నేరుగా మాట్లాడిన రాజేష్, పాఠశాలలో ఉన్న వసతులపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. విద్యార్థులకు ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకురావాలని సూచిస్తూ, పెద్ద అన్నలా ఎప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.Chirala Local News
చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.







