chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

KARLAPALEM NEWS:పవిత్ర రంజాన్ మాసంలో కరీముల్లా బేగ్ మరణం అల్లాకు ప్రీతిపాత్రం- తాండ్ర సాంబశివరావు

– ఘనంగా జరిగిన మాజీ సైనికుడు కరీముల్లా బేగ్ అంతిమ యాత్ర – పార్థీవ దేహంపై మువ్వన్నెల జెండా కప్పి నివాళులు అర్పించిన రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం

కర్లపాలెం (బాపట్ల జిల్లా), మార్చి 4: దేశ సేవలో తన జీవితాన్ని ధన్యం చేసుకున్న సీనియర్ మాజీ సైనికుడు మహమ్మద్ కరీముల్లా బేగ్ (కర్లపాలెం) అనారోగ్యంతో కన్నుమూయడం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం (APRMSSS) తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. బుధవారం కర్లపాలెం పోలీస్ స్టేషన్ ఎదురు వీధిలోని ఆయన నివాసంలో కరీముల్లా బేగ్ పార్థీవ దేహానికి సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు ఘన నివాళులు అర్పించారు.

KARLAPALEM NEWS:పవిత్ర రంజాన్ మాసంలో కరీముల్లా బేగ్ మరణం అల్లాకు ప్రీతిపాత్రం- తాండ్ర సాంబశివరావు

అల్లాకు ప్రీతిపాత్రుడు

ఈ సందర్భంగా తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ.. “దేశ సేవలో తరించిన కరీముల్లా బేగ్, తాను ఆరాధించే అల్లాకు కూడా అత్యంత ప్రీతిపాత్రుడు. ఆయన పవిత్రమైన రంజాన్ మాసంలో స్వర్గస్తులవ్వటమే ఇందుకు నిదర్శనం” అని పేర్కొన్నారు. కరీముల్లా బేగ్ పార్థీవ దేహంపై సగౌరవంగా మువ్వన్నెల జెండాను కప్పి, పూలమాలలు వేసి ‘జోహార్లు’ అర్పించారు. భారత మాతకు జేజేలు పలుకుతూ ఆయన చేసిన సేవలను కొనియాడారు.

బాధ్యతగా సేవా కార్యక్రమాలు

స్వర్గస్తులైన సైనికులకు, అమరవీరులకు అంతిమ యాత్రల్లో గౌరవప్రదంగా నివాళులు అర్పించడం తమ సంఘం బాధ్యతగా భావిస్తున్నామని సాంబశివరావు తెలిపారు. బాపట్ల జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా APRMSSS ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటూ, సైనిక సంక్షేమమే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

KARLAPALEM NEWS:పవిత్ర రంజాన్ మాసంలో కరీముల్లా బేగ్ మరణం అల్లాకు ప్రీతిపాత్రం- తాండ్ర సాంబశివరావు

పాల్గొన్న మాజీ సైనికులు

ఈ అంతిమ నివాళి కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్టా ఆదిశేషా రెడ్డి, ఉపాధ్యక్షులు చలికొండ వెంకట కృష్ణారావు, APRMSSS గౌరవ సలహాదారులు సుంకర శేషగిరి రావు పాల్గొన్నారు. వారితో పాటు సీనియర్ మాజీ సైనికులు రుక్మదరరావు, షేక్ బాజీ, రాయపూడి శ్రీనివాసరావు, ఇస్మాయిల్ బెగ్, బాలా వెంకట కృష్ణా రెడ్డి, బక్కా రామకృష్ణా రెడ్డి, ఉమ్మారెడ్డి కృష్ణ, అద్దంకి రమేష్ తదితరులు పాల్గొని కరీముల్లా బేగ్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు.TODAY BAPATLA NEWS

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker