
విశాఖపట్నం, మార్చి 7:-జనగణన–2027 ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ తెలిపారు. శనివారం ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన మూడు రోజుల శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, జనగణన ప్రక్రియ దేశ అభివృద్ధికి కీలకమైన సమాచారాన్ని అందిస్తుందని చెప్పారు. ప్రజల జనాభా వివరాలు, సామాజిక-ఆర్థిక పరిస్థితులు, నివాస స్థితిగతులు వంటి అంశాలను ఖచ్చితంగా నమోదు చేయడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. శిక్షణ ద్వారా అధికారులు, సిబ్బంది జనగణన విధానం, డిజిటల్ పద్ధతులు, డేటా సేకరణలో అనుసరించాల్సిన విధానాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.

జనగణన కార్యక్రమం పారదర్శకంగా, సమర్థంగా జరిగేందుకు ప్రతి శాఖ సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ తెలిపారు. ప్రజలకు సరైన సమాచారం అందించి, వారి సహకారంతో జనగణన ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు.Visakha Local News :హెచ్ఐవీ సంరక్షణ–చికిత్సపై వైద్యులకు శిక్షణా కార్యక్రమం
ఈ కార్యక్రమంలో జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, జిల్లా ఫారెస్ట్ అధికారి రవీంద్ర ధామ్ తదితర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.







