chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍ఎలూరు జిల్లా

POLAVARAM LOCAL NEWS:పోలవరం నిర్మాణంలో రాజీ లేదు.. ఈ నెలాఖరుకు కొత్త డయాఫ్రం వాల్ పూర్తి

  • జూన్ నాటికి కాలువల అనుసంధానం
  • నిర్వాసితులకు రూ.1900 కోట్ల పరిహారం పంపిణీ
  • పోలవరం పనుల పరిశీలనలో రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు

ఏలూరు/పోలవరం: రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ నాణ్యత, భద్రతా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ పలు కీలక విషయాలను వెల్లడించారు.

కొత్త డయాఫ్రం వాల్ పనులు ముమ్మరం గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుకు అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్ ధ్వంసమైందని మంత్రి గుర్తుచేశారు. ప్రజా భద్రత, ప్రాజెక్టు నాణ్యతను దృష్టిలో ఉంచుకునే పాతదాని స్థానంలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని చేపట్టామని తెలిపారు. “మొత్తం 1372 మీటర్ల పొడవు నిర్మించాల్సి ఉండగా, ఇప్పటికే 1300 మీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. ఈ నెలాఖరు నాటికి డయాఫ్రం వాల్ నిర్మాణం నూరు శాతం పూర్తవుతుంది,” అని ఆయన వెల్లడించారు. అలాగే, ఈసీఆర్‌ఎఫ్ (ECRF) డ్యాం నిర్మాణ ప్రాంతంలో నేలను గట్టిపరిచేలా వైబ్రో కాంప్యాక్షన్ పనులను కూడా విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఈ ఏడాది జూన్ నాటికి ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల అనుసంధాన పనులను పూర్తి చేసేలా లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి వివరించారు.

నిపుణుల పర్యవేక్షణలోనే పనులు కేంద్ర జల సంఘం (CWC) ఆమోదించిన డిజైన్లు, అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్ సూచనల మేరకే పోలవరంలో పనులు జరుగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (PPA) ప్రతిరోజూ ఈ పనులను పర్యవేక్షిస్తోందని, ప్రాజెక్టు పురోగతిని ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తున్నామని పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో రాజీ పడకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని ఆయన తెలిపారు.

సాగునీటి రంగానికి పెద్దపీట పోలవరంతో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను సైతం ఒక క్రమపద్ధతిలో పూర్తి చేసేందుకు స్పష్టమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామన్నారు. సాగునీటి రంగానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ పెద్దపీట వేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. నిర్వాసితుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, 2016లో చంద్రబాబు రూ. 700 కోట్ల పరిహారం అందించగా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక రెండు దఫాలుగా రూ. 1900 కోట్లను పంపిణీ చేసినట్లు గుర్తుచేశారు. ప్రాజెక్టు నిర్మాణంపై వచ్చే సలహాలు, సూచనలతో పాటు విమర్శలను సైతం మనస్ఫూర్తిగా స్వీకరిస్తామని మంత్రి రామానాయుడు స్పష్టం చేశారు.http://ELURU DISTRICT NEWS

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker