
ఆంధ్రప్రదేశ్ స్వయం ప్రతిపత్తి కళాశాలల యాజమాన్య సంఘం (Autonomous College Management’s Association of Andhra Pradesh) అధ్యక్షుడిగా బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు ముప్పలనేని శ్రీనివాసరావు ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు స్వయం ప్రతిపత్తి కళాశాలల యాజమాన్యాలు, విద్యాసంస్థల సిబ్బంది ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. విద్యారంగ అభివృద్ధికి ఆయన నాయకత్వం మరింత దోహదపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
అధ్యక్షుడిగా ఎన్నికైన ముప్పలనేని శ్రీనివాసరావు భవిష్యత్తులో విద్యా సంస్థల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం కోసం కృషి చేస్తారని పలువురు అభిప్రాయపడ్డారు Bapatla Local News







