
బాపట్ల, మార్చి 16: జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం నుండి ప్రారంభమైన ఈ పరీక్షల సందర్భంగా పట్టణంలోని అన్నవరపు వారి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఏప్రిల్ 1వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలలో ఎటువంటి అవకతవకలు లేదా ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు.

ముఖ్యంగా ఎండల తీవ్రత దృష్ట్యా విద్యార్థుల కోసం పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, ఓ.ఆర్.ఎస్ (ORS) ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు స్పష్టం చేశారు.http://BAPATLA NEWS







