
చీరాలలోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజిలో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘డ్రోన్ టెక్నాలజీ’పై మూడు రోజుల వర్క్ షాపు సోమవారం (16-03-2026) ఘనంగా ప్రారంభమైంది. రామ్సూర్ అగ్రియల్ ఎల్.ఎల్.పి సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు పర్యవేక్షణలో ప్రిన్సిపాల్ డా. కె. జగదీష్ బాబు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధునిక సాంకేతిక ప్రపంచంలో డ్రోన్లకు ఉన్న ప్రాధాన్యతను వివరిస్తూ, వీటిపై పట్టు సాధిస్తే విద్యార్థులకు అద్భుతమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. మెకానికల్ హెచ్.ఓ.డి డా. లక్ష్మీ తులసి చావలి నేతృత్వంలో జరుగుతున్న ఈ శిక్షణలో బి.టెక్ ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులకు డ్రోన్ల తయారీ, పనితీరుపై ప్రత్యక్ష ప్రయోగాలు చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు డా. సి. సుబ్బారావు, వనమా దొర నాగ సాయినాథ్, కో-ఆర్డినేటర్లు పి. హరీష్, బి. రవికుమార్ మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు.http://BAPATLA NEWS







