chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలు

JAATHIYA VARTHALU:హెచ్చరిక- గ్యాస్ బిల్ అప్‌డేట్ పేరుతో కొత్త సైబర్ మోసాలు!

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ బుకింగ్స్ పేరుతో కొత్త తరహా సైబర్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మోసాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం గురువారం ఓ ప్రకటనలో తీవ్రంగా హెచ్చరించింది. సైబర్ నేరగాళ్లు ‘GAS BILL UPDATE APK’ వంటి హానికరమైన ఫైల్స్‌ను (Malicious Files) వాట్సాప్ ద్వారా వినియోగదారులకు పంపుతున్నారని, వీటిని డౌన్‌లోడ్ చేస్తే ప్రమాదంలో పడతారని అధికారులు తెలిపారు.

LPG e-KYC

ఇలాంటి అనుమానాస్పద ఫైల్స్ లేదా అప్లికేషన్లను ఎట్టిపరిస్థితుల్లోనూ డౌన్‌లోడ్ లేదా ఇన్‌స్టాల్ చేయవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటి ద్వారా సైబర్ నేరగాళ్లు వినియోగదారుల ఫోన్‌లను హ్యాక్ చేసి, వ్యక్తిగత డేటా, బ్యాంకు ఖాతాల వివరాలను దొంగిలించే ప్రమాదం ఉందని అధికారులు వివరించారు. గ్యాస్ బుకింగ్స్ లేదా బిల్లు చెల్లింపుల కోసం కేవలం చమురు సంస్థల అధికారిక యాప్‌లు (official platforms) మాత్రమే ఉపయోగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

సరఫరాకు ఢోకా లేదు.. వదంతులు నమ్మకండి

మరోవైపు, దేశవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు అవసరమైన ఏర్పాట్లను మరింత పటిష్టం చేయాలని కేంద్రం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. గ్యాస్ కొరతపై వదంతులు నమ్మవద్దని, ఆందోళనతో సిలిండర్లు బుక్ చేసుకోవద్దని కోరింది. గ్యాస్ సరఫరాను నిరంతరాయంగా కొనసాగించేందుకు పట్టణ ప్రాంతాల్లో 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు ఒకసారి బుకింగ్ చేసుకునేలా విరామాన్ని సవరించినట్లు ప్రభుత్వం తెలిపింది. గ్యాస్ సరఫరాకు ఢోకా లేదని భరోసా ఇస్తూనే, సైబర్ మోసాల పట్ల ప్రజలను జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం కోరింది.http://JAATHIYA VARTHALU

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker