
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. మార్చి 21వ తేదీన ప్రభుత్వం ‘ఈద్-ఉల్-ఫితర్’ (రంజాన్) సందర్భంగా బహిరంగ సెలవు ప్రకటించిన నేపథ్యంలో, ఆ రోజు జరగాల్సిన పదవ తరగతి ఇంగ్లీష్ (Third Language) పరీక్షను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం, వాయిదా పడిన ఈ పరీక్షను ఏప్రిల్ 2వ తేదీ (గురువారం) ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు నిర్వహించనున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ మార్పును గమనించాలని అధికారులు సూచించారు.http://AMARAVATHI NEWS







