
గుంటూరు: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి గారు బుధవారం గుంటూరు జిల్లాలో పర్యటించారు. పొన్నూరు ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారి కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా సరిహద్దులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ ప్రభుత్వ అధికారులు మరియు పోలీసు యంత్రాంగం ఘన స్వాగతం పలికింది.

ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, అదనపు ఎస్పీ రమణమూర్తి తదితరులు ఉన్నారు. అధికారులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ముఖ్యమంత్రి వివాహ వేడుకకు హాజరై, నవదంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.http://GUNTUR NEWS







