chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍ఎలూరు జిల్లా

Eluru Local News :దళిత క్రైస్తవులు, ముస్లింలకు ఎస్సీ హోదా కల్పించాలి-దళిత సేన డిమాండ్

ఏలూరు జిల్లా, పెదవేగి:– కేంద్ర ప్రభుత్వం 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను వెంటనే రద్దు చేసి, దళిత క్రైస్తవులకు మరియు దళిత ముస్లింలకు ఎస్సీ (SC) హోదా కల్పించాలని దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షులు జిజ్జువరపు రవి ప్రకాష్ డిమాండ్ చేశారు.

ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం, పెదవేగి మండలం అమ్మపాలెంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన దళిత సేన మహిళా కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రవి ప్రకాష్ మాట్లాడుతూ.. దళిత క్రైస్తవులపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును నిలుపుదల చేసి, దానిపై పునర్ సమీక్ష చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

మతం వేరు.. కులం వేరు: రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం ప్రతి పౌరుడికి నచ్చిన మతాన్ని ఆచరించే, ప్రచారం చేసుకునే స్వేచ్ఛ ఉందని ఆయన గుర్తు చేశారు. కులం ప్రాతిపదికన దళితులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, వారు ఏ మతాన్ని స్వీకరించినా కొనసాగాలని ఆయన వాదించారు. కులం వేరు, మతం వేరు అని, కేవలం మతం మారినంత మాత్రాన కులపరమైన వెనుకబాటుతనం పోదని ఆయన స్పష్టం చేశారు.Eluru Local News

దళిత క్రైస్తవ, దళిత ముస్లింలకు ఎస్సీ హోదా కల్పించే వరకు తమ పోరాటం ఆగదని రవి ప్రకాష్ హెచ్చరించారు. ఈ మేరకు పార్లమెంటులో ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో ఏలూరు జిల్లా దళిత సేన మహిళా అధ్యక్షురాలు బేతాళ జయసుధ, జిల్లా కార్యదర్శి ముత్యాల ఝాన్సీ రాణి, దెందులూరు నియోజకవర్గం అధ్యక్షురాలు రే మల్లె స్వర్ణకమలం, అమ్మపాలెం గ్రామ అధ్యక్షురాలు పానమాల మల్లేశ్వరి తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker