ఆంధ్రప్రదేశ్
PHIRANGIPURAM…ఫిరంగిపురం మార్కెట్ యార్డులో ఈవీఎం గోడౌన్ పరిశీలన
ఫిరంగిపురం మండలం రేపూడి గ్రామం మార్కెట్ యార్డులోని ఈవీఎం, VVPATS భద్రపరిచిన గోడౌన్ ను గురువారం గుంటూరు జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి పరిశీలించారు. గోడౌన్ లో భద్రపరిచిన బ్యాలెట్ యూనిట్లు, ఎన్నికల సామగ్రిని పరిశీలించారు. అనంతరం సీసీటీవీ పనితీరు పరిశీలించారు. కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు , ఫిరంగిపురం తహసిల్దార్ ప్రసాదరావు, తెలుగుదేశం, జనసేన,, బిజెపి పార్టీల నాయకులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.