ఆంధ్రప్రదేశ్
ఫిరంగిపురం టీడీపీ కార్యాలయంలో పూలే జయంతి
ఫిరంగిపురంలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ నాయకులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కొత్తపల్లి కోటేశ్వరరావు మాట్లాడుతూ పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మండవ చిన్న నరసింహారావు, మండల బిసి సెల్ అద్యక్షుకులు బైనబోయిన శివయ్య నాయకులు పాల్గొన్నారు.