BAPATLA NEWS: నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ ను (నీట్ యు. జి. 2025) ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు.
COLLECTOR VISIT EXAM CENTER
ఆదివారం,నీట్ యు.జి.పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ మురళి తనిఖీ చేశారు. చీరాల యార్లగడ్డ అన్నపూర్ణాంబ ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ మహిళ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన నీట్ యూజీ 2025 పరీక్షా కేంద్రాలకు ఆయన చేరుకుని భద్రతా ఏర్పాట్లను, పరిశీలించారు. పరీక్షకు హాజరైన విద్యార్థుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఏర్పాటుచేసిన గదుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఒక్కొక్క గదికి 24 మంది విద్యార్థుల చొప్పున కేటాయించడమైనదని అన్నారు. యార్లగడ్డ అన్నపూర్ణంబ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కేంద్రంలో 240 మంది విద్యార్థులను కేటాయించగా, హాజరు, గైర్హాజర్ వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. 235 మంది విద్యార్థులు హాజరుకాగా, 5 మంది గైర్హాజరైనట్లు, అదేవిధంగా ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల కేంద్రంలో 176 మంది విద్యార్థులను కేటాయించగా 169 మంది విద్యార్థులు హాజరయ్యారని 7 మంది గైర్హాజరు అయినట్లు ప్రధాన ఆచార్యులు ఆయన దృష్టికి తెచ్చారు. నీట్ యూజీ పరీక్షా సరళి ని అయన అడిగి తెలుసుకున్నారు. పరీక్ష ముగిసిన తర్వాత తీసుకునే చర్యలపై ఆయన అధికారులను ఆరా తీశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, ప్రశాంత వాతావరణంలో నీట్ యు. జి పరీక్ష జరిగిందని,అధికారులు పకడ్బందీగా పరీక్షను నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.