BAPATLA NEWS: జాతీయ రహదారుల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని….
COLLECTOR MEETIN ON DEVELOPMENT
వాడరేవు-నకిరేకళ్ళు, బెంగళూరు-కడప-విజయవాడ జాతీయ రహదారుల నిర్మాణ పనులు వేగంగా జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. జిల్లాలో చేపట్టిన జాతీయ రహదారుల నిర్మాణ పనులపై రెవెన్యూ అధికారులతో స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో ఆయన సమావేశం నిర్వహించారు. వాడరేవు-నకిరికల్లు జాతీయ రహదారి 167-ఏ నిర్మాణంలో కారంచేడు, పర్చూరు, వేటపాలెం, చీరాల మండలాలలో భూ సేకరణ సమస్యలు పరిష్కరించాలన్నారు. రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయిన వారందరికీ న్యాయబద్ధంగా నగదు చెల్లింపులు జరగాలన్నారు. చీరాల మండలంలోని ప్రభుత్వ పోరంబోకు భూమిలో నివాసముంటున్న 63 గృహాల నిర్మాణాలను తక్షణమే తొలగించాలన్నారు. చట్టబద్ధంగా వారికి రావలసిన పరిహారం అందించాలన్నారు. బెంగళూరు-కడప-విజయవాడ జాతీయ రహదారి 544- జి నిర్మాణానికి ఆటంకంగా ఉన్న భూ సమస్యలు తక్షణమే పరిష్కరించాలన్నారు. జెపంగులూరు మండలంలో ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని తక్షణమే సమస్యను పరిష్కరించాలన్నారు. అద్దంకిలో ఆక్రమణలు తొలగించి రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ కారణాల చేత నష్టపరిహారం నగదు చెల్లింపులు నిలిచిపోయిన వారికి తక్షణమే అందించాలన్నారు. రహదారుల నిర్మాణంలో జాప్యం ఉండరాదని ఆదేశించారు. ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని అధికారులకు మార్గ నిర్దేశం చేశారు. రెవిన్యూ సమస్యలన్నీ మూడు రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. 16వ నంబర్ జాతీయ రహదారి నిర్మాణాలో భాగంగా పిచ్చుకల గుడిపాడు వద్ద సర్వీస్ రోడ్డు నిర్మాణం కొరకు అర్థ హెక్టార్ భూసేకరణ త్వరగా చేపట్టాలన్నారు. సమీపంలో ఉన్న మరో భూమి సమస్య తక్షణమే పరిష్కరించాలన్నారు.