chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
📍 పల్నాడు జిల్లాఆంధ్రప్రదేశ్

PALNADU NEWS: జగన్ చెప్పేవన్నీ అబద్ధాలే, వైసిపి పుట్టుకే ఒక మోసం

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ళ పర్యటనపై సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాల్లో రాంగోపాల్ రావు రాత్రి హత్య చేసి తెల్లవారి పరామర్శించే విధంగా జగన్ పర్యటన ఉందని ఘాటు విమర్శలు చేశారు. గుంటూరులోని తన నివాసంలో కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. నాగమల్లేశ్వరరావు చనిపోవడానికి వైసిపి యే కారణమని చెప్పారు. 2024 ఎన్నికల ఫలితాల సందర్భంగా ఇంట్లో 10 లక్షలు ఉండగా రెండు కోట్ల వరకు బెట్టింగ్ పెట్టి నష్ట పోయాడని తెలిపారు. బంధువులు ఎవరు ఆర్థికంగా సపోర్ట్ చేయకపోగా అవమానించిన కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు. నీ వల్ల ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాన్ని జగన్ ఎలా పరామర్శిస్తాడని సూటిగా ప్రశ్నించారు. తెనాలిలో కూడా గంజాయి బ్యాచ్ ని పరామర్శించేందుకు జగన్ వెళ్లి హడావిడి చేశాడని చెప్పారు. గతంలో చంద్రబాబు ఛలో ఆత్మకూరు చేపడితే రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసినవారు ప్రస్తుతం రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
జగన్ చెప్పేవన్నీ అబద్ధాలే, వైసిపి పుట్టుకే ఒక మోసం అని ధ్వజమెత్తారు. జగన్ అరాచకత్వం, రాక్షసత్వాన్ని చూసి 2024 ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. ఇలానే అరాచకాలు చేస్తే వచ్చే ఎన్నికల్లో 11 సీట్లు కూడా రావని ఆయన వెల్లడించారు. ప్రజలను మోసం చేస్తూ జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Author

  • PALNADU NEWS: జగన్ చెప్పేవన్నీ అబద్ధాలే, వైసిపి పుట్టుకే ఒక మోసం

    Rambabu K. is a senior Telugu journalist and the Bureau Chief of City News Telugu. Beginning his career in 1998, he has worked with leading media houses such as Eenadu, Sakshi, and Vaartha. With over 25 years of experience, Rambabu blends powerful reporting with innovative marketing strategies that strengthen local and digital journalism. Along with his editorial leadership, he plays a key role as a journalists’ union leader, actively advocating for press freedom, fair working conditions, and ethical reporting standards.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker