ఆంధ్రప్రదేశ్

Chilakaluripeta news:అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలలో భాగంగా భారతరత్న ఇందిరా గాంధీ మున్సిపల్ హై స్కూల్, చిలకలూరిపేట విద్యార్థుల యోగాభ్యాసనాలు.

Slice Scroll Ad
Ad Image 1 Ad Image 2 Ad Image 3

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా స్థానిక భారతరత్న ఇందిరాగాంధీ మున్సిపల్ హై స్కూల్ ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుక మాదిరిగా నిర్వహించబడింది. విద్యార్థులు మరియు ఉపాధ్యాయులందరూ ఉదయం 6 గంటలకు హాజరై ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ… యోగ మన భారతీయ సంస్కృతిలో ఒక భాగమని, అంతర్జాతీయ స్థాయిలో యోగా యొక్క ప్రాముఖ్యతను నలదిశల వ్యాపించేటట్లు జరిగిన ప్రభుత్వ కృషి అభినందనీయం మరియు ఆచరణీయమని అన్నారు. ఉరుకుల ,పరుగుల జీవితంలో నేడు మానవుడు ఎదుర్కొంటున్న మానసిక మరియు శారీరక అనారోగ్యాలు అన్నింటికీ యోగా ఓ మంత్రం లాంటిదని, ఎలాంటి ఖర్చు లేకుండా ప్రతి ఒక్కరు కూడా తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకునే మెళకువలు ఇది నేర్పిస్తుందని, ప్రతి ఒక్కరి దైనందన జీవితంలో యోగా అంతర్భాగమైతే జీవితాలు ఆనందమయం అవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్కూల్ మేనేజ్మెంట్ చైర్ పర్సన్ మరియు ఇతర సభ్యులు పాఠశాల ఉపాధ్యాయ మరియు ఉపాధ్యాయేతర సిబ్బంది మరియు పండరీపురం -01 సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం విద్యాశాఖ అధికారుల సూచనల మేరకు పాఠశాల ఉదయం 6 గంటల నుండి ప్రారంభమై 8 గంటల వరకు యోగాభ్యాస కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker