ఆంధ్రప్రదేశ్
ఫిరంగిపురంలో ఘనంగా యోగా దినోత్సవం
ఫిరంగిపురంలోని సెయింట్ పాల్స్ ఉన్నత పాఠశాలలో యోగా దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. అధికారులు, విద్యార్థులు, మహిళలు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శివ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ యోగాతోనే సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్య భాగ్యం సిద్ధిస్తుందని, దైనందిన జీవితంలో యోగా ఒక భాగం కావాలని అన్నారు. తహసిల్దార్ ప్రసాదరావు మాట్లాడుతూ
మానసిక సమస్యలకు, శారీరక రుగ్మతలకు యోగా మంచి ఫలితాలు ఇస్తుందన్నారు. ఒత్తిళ్ల కారణంగా ఎంతో మంది అనేక శారీరక, మానసిక ఆరోగ్య రుగ్మతలను ఎదుర్కొంటున్నారన్నారు. వీటన్నింటినీ జయించి సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే సులభతరమైన ఆరోగ్య సూత్రం యోగా మాత్రమే అన్నారు. అనంతరం అవగాహన ర్యాలీ, మానవహారం నిర్వహించారు.