మంగళగిరిలో కుల వివక్ష ఘటనపై బాధితుల తరపు సాక్షులను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధిత మహిళలు మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
మంగళగిరిలో కుల వివక్ష ఘటనపై బాధితుల తరపు సాక్షులను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధిత మహిళలు మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
మంగళగిరి కుప్పరావు కాలనీకి చెందిన పగిడిపోగు రాధ అనే దళిత మహిళ పట్ల కుల వివక్ష చూపుతూ, వారు వీధిలో నడిస్తే మునగాల ప్రీతి అనే మహిళ దళితులు ఇంటి ఎదుట నడిచారని, పసుపు నీళ్లు జల్లుతూ అవమానించారని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆమెకు అండగా నిలిచిన సొంత సామాజిక వర్గానికి చెందిన మహిళలు సాక్షులుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోవడంతో పగ పెంచుకొని మునగాల ప్రీతి మరిది మునగాల సుధాకర్ అనే వ్యక్తి సదరు సాక్షుల ఇంటి లోపలికి అర్ధరాత్రి ప్రవేశించి దుర్భాషలాడుతూ చంపేస్తానని బెదిరించారని మహిళలు మీడియాకు తెలిపారు. తమను భయభ్రాంతులకు గురి చేస్తున్న మునగాల ప్రీతిని, ఆమె మరిది మునగాల సుధాకర్ లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దళిత సంఘాల నేతలు, స్థానిక మహిళలతో కలిసి ఫిర్యాదు చేశారు