గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో జీవన్ రద్ అడ్వాన్సుడ్ మొబైల్ బస్సును ప్రారంభించిన…ఎంపీ వల్లభనేని బాలసౌరి, ఎమ్మెల్యే వెనిగండ్ల
గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో జీవన్ రద్ అడ్వాన్సుడ్ మొబైల్ బస్సును ప్రారంభించిన…ఎంపీ వల్లభనేని బాలసౌరి, ఎమ్మెల్యే వెనిగండ్ల
ప్రజలకు అందుబాటులోకి వచ్చిన….రూ.3.50కోట్ల అడ్వాన్సుడ్ మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనం
ప్రజలందరికీ నాణ్యమైన,మెరుగైన వైద్య సేవలు అందడమే నా లక్ష్యం:ఎంపీ బాలసౌరి
రూ.2.60 కోట్లతో గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో సిటీ స్కాన్, సోలార్ వ్యవస్థ ఏర్పాటు:ఎంపీ బాలసౌరి
గుడివాడ ప్రజల మంచి కోసం ఎంపీ బాలసౌరీ చేస్తున్న కృషి ఎనలేనిది: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
సమర్థత, ప్రతిభ కలిగిన బాలసౌరీ సహచర్యంలో ఎన్నో విషయాలు నేర్చుకున్న: ఎమ్మెల్యే రాము
గుడివాడ జూన్21: ప్రభుత్వ హాస్పిటల్స్ లో ప్రజలందరికీ నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నానని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలసౌరి అన్నారు.
భారత్ ఎలక్ట్రానిక్స్ సంస్థ రూ.3.50కోట్ల సి.ఎస్.ఆర్ నిధులతో గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అడ్వాన్సుడ్ మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అండ్ డయాగ్నొస్టిక్ యూనిట్ జీవన్ రద్ బస్సును ఎంపీ వల్లభనేని బాలసౌరి, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శనివారం ఉదయం ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో ఎంపీ బాలసౌరి మాట్లాడుతూ…. క్యాన్సర్ మహమ్మారితో పార్లమెంట్ పరిధిలో వందలాది మంది చనిపోతున్నట్లు నివేదికల ద్వారా గుర్తించి మూడున్నర కోట్ల నిధులతో…. ఆల్ట్రాసౌండ్, బ్లెడ్ టెస్ట్ ఇలా అత్యాధునిక వసతులతో జీవన్ రద్ బస్సులను ప్రజలకు అందుబాటులో తెచ్చామన్నారు.
ఇప్పటికే మచిలీపట్నం, పెడనలో నియోజకవర్గాల్లో అందుబాటులోకి వచ్చిన ఈ బస్సు ద్వారా పదుల సంఖ్యలో క్యాన్సర్ బారిన పడిన వారిని ముందస్తుగా గుర్తించి చికిత్స అందిస్తున్నామన్నారు.
నా తండ్రి కూడా క్యాన్సర్ వ్యాధితో చికిత్స చేయించుకుంటూ మరణించారని ఆయన చెప్పారు.
ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికి అతి ముఖ్యమైనదనీ, ముందస్తు పరీక్షలు ద్వారా గుర్తించిన వ్యాధులను సులభంగా నియంత్రంచవచ్చని ఎంపీ బాలసౌరి పేర్కొన్నారు.
కోట్లాది రూపాయల కేంద్ర సిఎస్సార్ నిధులతో గుడివాడతో పాటుగా పార్లమెంటు పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిల్లో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు.
గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి కోటి 85 లక్షలతో సిటీ స్కాన్ మంజూర అయిందని, అదేవిధంగా హాస్పటల్ భవనాల పైన రూ.76 లక్షలతో అత్యాధునిక సోలార్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీ బాలసౌరి చెప్పారు.
ప్రజల మంచి కోసం తాము చేస్తున్న కృషిలో, వైద్యులు, సిబ్బంది అందరూ భాగస్వామ్యులై ఆసుపత్రిల్లో సేవా దృక్పథంతో పనిచేస్తూ వైద్య సేవలు అందించాలని ఎంపీ బాలసౌరి పిలుపునిచ్చారు.
గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ….. గ్రామాల్లోకి వచ్చే జీవన్ రధ్ బస్సులోని అడ్వాన్సుడ్ వైద్య సేవలను ప్రజలందరూ సమయాన్ని కేటాయించి సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్యాన్సర్ లాంటి మహమ్మారులను ముందస్తుగా గుర్తిస్తే, సులభంగా నియంత్రించ వచ్చని ఆయన పేర్కొన్నారు.వందలాది కోట్ల నిధులతో గుడివాడ ప్రజల సుదీర్ఘ సమస్యలను పరిష్కరిస్తున్న ఎంపీ వల్లభనేని బాలసౌరీకు, ప్రజలందరి తరపున ధన్యవాదాలు చెబుతున్నానని ఎమ్మెల్యే రాము అన్నారు. ఎంతో ప్రతిభ, సమర్థత, పరిజ్ఞానం కలిగిన ఎంపీ బాలసౌరి సహచర్యంలో తాను అనేక విషయాలను నేర్చుకున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా మార్క్ ఫైడ్ చైర్మన్ బండి రామకృష్ణ, డిసిహెచ్ఎస్ శేషు కుమార్,
ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, గుడివాడ జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, ఆర్డిఓ జి.బాలసుబ్రమణ్యం,హాస్పటల్ సూపరిండెంట్ ఇందిరా దేవి, అభివృద్ధి కమిటీ చైర్మన్ గుడివాడ జోన్స్ దయానంద్, సభ్యులు మరిదు కరుణ, దేవేంద్రుడు, ప్రోగ్రాం ఆఫీసర్ బిందు, పీపీ యూనిట్ వైద్యులు శ్వేత,సీనియర్ టిడిపి నాయకులు పిన్నమనేని బాబ్జి, చేకూరి జగన్మోహన్రావు, టిడిపి అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, జనసేన అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, బిజెపి అధ్యక్షుడు ఆర్కే, వైద్య అధికారులు, హాస్పిటల్ వైద్యులు ,సిబ్బంది, పలువురు కూటమి పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.