అమరావతిఆంధ్రప్రదేశ్
Two women donated 4 bracelets and cash for the construction of the capital Amaravati
రాజధాని అమరావతి నిర్మాణానికి ఇద్దరు మహిళలు 4 చేతి గాజులు, నగదును విరాళంగా ఇచ్చారు. రాష్ట్ర రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలనే ఆలోచనతో తమవంతు సాయం అందిస్తున్నట్లు వారు తెలిపారు. సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును నేడు కలిసి తెనాలికి చెందిన నన్నపనేని ఉదయలక్ష్మీ 36 గ్రాముల 546 మిల్లీగ్రాముల నాలుగు బంగారు గాజులతో పాటు మరో రూ.1 లక్ష చెక్కును, విజయవాడకు చెందిన వెలగపూడి చంద్రావతి రూ.50 వేలు విరాళంగా ఇచ్చారు. వారి ఔదార్యం, ఉదారత ఎంతో మందికి స్ఫూర్తినిస్తుందని సీఎం అన్నారు.