
అమరావతి, మార్చి 23: రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి చరిత్రలో ఈరోజు ఒక సువర్ణ అధ్యాయం లిఖించబడుతోందని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అభివర్ణించారు. ఉక్కు రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుమారు రూ.1.36 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ప్రతిష్టాత్మక ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఈరోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో జరగనున్న ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కూడా పాల్గొననున్నారు. https://www.youtube.com/embed/3kc3SzKdRUE?si=q-WrVZ5kkLaOgcth
ఈ భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా రాష్ట్రంలోని లక్ష మందికి పైగా నిరుద్యోగ యువతకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. అంతేకాకుండా, ఈ స్టీల్ ప్లాంట్కు అనుబంధంగా సుమారు రూ.11,198 కోట్ల వ్యయంతో ఒక క్యాప్టివ్ పోర్టును కూడా అభివృద్ధి చేయనున్నట్లు, దీని ద్వారా మరో 6 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఆయన వివరించారు. ఆర్సెలర్ మిట్టల్ వంటి ప్రపంచ స్థాయి సంస్థ రాకతో విశాఖపట్నం రీజియన్ ఒక భారీ పరిశ్రమల హబ్గా రూపాంతరం చెందుతుందని మంత్రి సత్యప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. http://AMARAVATHI NEWS







