
Guntur:Kuchanapalli: 19-10-25:-విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు, ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, దీని ప్రభావంతో మంగళవారం నాటికి ఆ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని. ఆతదుపరి 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ, దక్షిణమధ్య బంగాళాఖాతం, పశ్చిమమధ్య బంగాళాఖాతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఆయన చెప్పారు.దీనివల్ల బుధవారం నుంచి ఏపీ, especially తూర్పు మరియు గోదావరి పరిధిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు
శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.వర్షాలు ఉరుములు, మెరుపులతో ఉండే అవకాశం ఉన్నందున, ప్రజలు చెట్ల క్రింద నిలబడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శనివారం సాయంత్రం 5 గంటలకు విజయనగరం నెల్లిమర్లలో 49.7 మిమీ, కృష్ణా ఘంటసాలలో 44.7 మిమీ, తిరుపతి 27.7 మిమీ వర్షపాతం నమోదైంది.







