chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్అమరావతి

Amaravathi Loval News :ఆదాయమే కాదు-ఆరోగ్యకరమైన వృద్ధే లక్ష్యం- సీఎం చంద్రబాబు

అమరావతి: డిసెంబర్‌ 22:-రాష్ట్రంలో మద్యం విధానాన్ని వ్యాపారంలా కాకుండా, ఆరోగ్యకరమైన వృద్ధిని సాధించే దిశగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆదాయమే లక్ష్యంగా విధానాలు రూపొందించకూడదని స్పష్టం చేశారు. సచివాలయంలో సోమవారం ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం కీలక సూచనలు చేశారు.

లాటరీ విధానంలో షాపుల కేటాయింపు, అప్లికేషన్‌ ఫీజు, రిటైలర్‌ మార్జిన్‌ పెంపు, లిక్కర్‌ ఐడెంటిఫికేషన్‌ నెంబర్‌ (LIN) అమలు వంటి అంశాలపై మరింత పునఃపరిశీలన చేయాలని సూచించారు. బార్‌ ఏఆర్‌ఈటీ మినహాయింపు అంశాన్ని కూడా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

అక్రమ మద్యం అరికట్టడం, బెల్టు షాపుల నియంత్రణ, డిజిటలైజేషన్‌, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. బెల్టు షాపుల కట్టడికి హర్యానా మోడల్‌ను అధ్యయనం చేయాలని సూచించారు.Nandha Jyothi

అక్టోబర్‌ 2024 నుంచి అక్టోబర్‌ 2025 వరకు రూ.8,000 కోట్ల ఎక్సైజ్‌ ఆదాయం లక్ష్యంగా పెట్టుకోగా, రూ.7,041 కోట్ల ఆదాయం వచ్చినట్టు అధికారులు సీఎంకు వివరించారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో మద్యం విక్రయాల్లో 4.52 శాతం వృద్ధి నమోదైందని తెలిపారు. ఐఎంఎఫ్ఎల్‌ విక్రయాలు 19.08 శాతం, బీర్‌ విక్రయాలు 94.93 శాతం పెరిగాయని వెల్లడించారు.

మద్యం విక్రయాల్లో డిజిటల్‌ చెల్లింపులు 34.9 శాతం పెరిగాయని, నగదు వినియోగాన్ని తగ్గించి డిజిటల్‌ లావాదేవీలు పెంచాలని సీఎం సూచించారు. ప్రతి మద్యం బాటిల్‌కు ప్రత్యేక లిక్కర్‌ ఐడెంటిఫికేషన్‌ నెంబర్‌ను త్వరితగతిన అమలు చేయాలని, జియో-ట్యాగింగ్‌తో సరఫరా వ్యవస్థలో పూర్తి పారదర్శకత తీసుకురావాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో మంత్రులు కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్‌, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పీయూష్‌కుమార్‌, ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ శ్రీధర్‌, ఈడీ రాహుల్‌ దేవ్‌ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker