Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
అమరావతిఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

అగ్రి “ఏడి” హఠాత్మరణం పట్ల మంత్రి ఫరూక్ దిగ్భ్రాంతి

అమరావతి సెప్టెంబరు 19-09- 25 :*నంద్యాల వ్యవసాయ శాఖ ఏడిగా పని చేస్తున్న బండారి ఆంజనేయ(58) శుక్రవారం తెల్లవారుజామున హఠాత్మరణం చెందడం పట్ల రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అమరావతిలో ఉన్న మంత్రి ఫరూక్ విడుదల చేసిన ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో సౌమ్యుడుగా, వివాదరహితుడిగా, వ్యవసాయ ఉద్యోగుల సంఘంజిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆంజనేయ రెండు నెలల క్రితమే బదిలీపై వచ్చి నంద్యాల డివిజన్ ఏడిగా విధులు నిర్వహిస్తున్నారు. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆంజనేయ మృతి చెందడం ఎంతో బాధాకరమని మంత్రి ఫరూక్ సంతాపం వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖలో మంచి ఉద్యోగిగా పేరు సంపాదించుకున్న ఆంజనేయ మృతి తో, అతని సేవలు నంద్యాల ప్రాంత రైతులకు దూరం కావడం మనోవేదనకు గురయ్యానని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. ఆంజనేయ కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని, ప్రభుత్వ పరంగా ఆంజనేయ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి ఫరూక్ సంతాపం వ్యక్తం చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button